అమెరికాలో(america) గుంటూరు(Guntur) యువకుడు గంగూరి శ్రీనాధ్ అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా ఉన్న సుఖవాసి రాజశ్రీని

అమెరికాలో(america) గుంటూరు(Guntur) యువకుడు గంగూరి శ్రీనాధ్ అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా ఉన్న సుఖవాసి రాజశ్రీని(sukavasi Rajasri) హైదరాబాద్ విమానాశ్రయంలో(Hyderabad Airport) ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనాధ్(srinath) మృతి పై విచారణ జరపాల్సిందిగా ఆయన తండ్రి బాబురావు ఏపీ సీఐడీ అధికారులను ఆశ్రయించటంతో గత ఏడాది కేసు నమోదు చేసారు. ఈ కేసులో రాజశ్రీ తో పాటు భర్త సుఖవాసి శ్రీనివాసరావు, శ్రీనాధ్ సతీమణి సాయి చరణీ పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో కోర్టుకు, సీఐడీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుమార్తె సాయి చరణీ దగ్గరకు రాజశ్రీ వెళ్లారు. ఆమె అమెరికా వెళ్లిన విషయం తెలుసుకున్న సీఐడీ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దీంతో బుధవారం రాత్రి ఆమె అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏపీ సీఐడీ అధికారులకు అప్పగిస్తారు.

Eha Tv

Eha Tv

Next Story