నైరుతి చైనాలోని ఓ షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.

నైరుతి చైనాలోని ఓ షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. అధికారిక వార్తా సంస్థ జిన్హువా నుండి అందిన సమాచారం ప్రకారం.. బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత 14 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం, రెస్క్యూ సిబ్బంది ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. ఈ రెస్క్యూ వర్కర్ల బృందం తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

చైనాలోని హైటెక్ 14 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి కారణమేమిటో.. మంటలు చెలరేగిన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Eha Tv

Eha Tv

Next Story