పాకిస్తాన్‌(Pakistan) మిలట్రీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇమ్రాన్‌ఖాన్‌(Imran khan) ప్రధానమంత్రి కాకూడదనుకుంది. కానీ ప్రజలు మాత్రం ఇమ్రాన్‌ఖానే కావాలనుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అడ్డదిడ్డమైన కేసులు పెట్టారు. జైల్లో వేశారు. ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా కట్టడి చేశారు. ఆయన పార్టీకి సింబల్‌ రాకుండా కుట్ర పన్నారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నికలు జరిపారు. మిలట్రీ ప్రత్యక్షంగా పాల్గొని రిగ్గింగ్‌ కూడా చేసింది. అయినప్పటికీ ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.

పాకిస్తాన్‌(Pakistan) మిలట్రీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇమ్రాన్‌ఖాన్‌(Imran khan) ప్రధానమంత్రి కాకూడదనుకుంది. కానీ ప్రజలు మాత్రం ఇమ్రాన్‌ఖానే కావాలనుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అడ్డదిడ్డమైన కేసులు పెట్టారు. జైల్లో వేశారు. ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా కట్టడి చేశారు. ఆయన పార్టీకి సింబల్‌ రాకుండా కుట్ర పన్నారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నికలు జరిపారు. మిలట్రీ ప్రత్యక్షంగా పాల్గొని రిగ్గింగ్‌ కూడా చేసింది. అయినప్పటికీ ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. దాంతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ -నవాజ్‌ (PML-N) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తెరతీసింది. మిత్రపక్షం పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీతో పాటు మరికొన్ని చిన్నాచితకా పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మెజారిటీ రాకపోయినా తన సోదరుడు షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు అనూహ్యంగా ఓ ట్విస్ట్‌ ఇచ్చారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ మద్ధతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే స్వతంత్ర అభ్యర్థులు(Independent Candidates) కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చని అందరూ అనుకున్నారు. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ మద్ధతుదారులంతా ఇండిపెండెంట్లుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్‌డ్‌ సీట్లు దక్కవు.

అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
పాకిస్తాన్‌లో ఇస్లామిక్‌ పొలిటికల్‌ పార్టీస్‌ గ్రూప్‌ అయిన ఇస్లామిక్‌ పొలిటికల్‌ అండ్‌ రెలిజియస్‌ పార్టీస్‌ గ్రూప్‌లో సున్నీ ఇత్తేహద్‌ కౌన్సిల్ ఓ చిన్న పార్టీ. ఈ పార్టీలో చేరడానికి ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులంతా రెడీ అయ్యారు. ఎస్‌ఐసీ తరఫున ఆ పార్టీ ఛైర్మన్‌ సయ్యద్‌ మహ్‌ఫూజ్‌ ఒక్కరే ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందారు. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పీటీఐ భావిస్తోంది. ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది. తమ సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అని పీటీఐ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి అయూబ్‌ ఖాన్‌ చెప్పారు.ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయని, మళ్లీ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదని పీటీఐ చైర్మన్‌(ఆపద్ధర్మ) గోహర్‌ అలీఖాన్‌ అంటున్నారు. ఈ వారంలోనే ఎస్‌ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్‌ ఎన్నికల సంఘానికి పంపనున్నామన్నారు. ఈ కూటమికి పాకిస్తాన్‌ ఈసీ అంగీకారం తెలిపితే మాత్రం పాకిస్తాన్‌ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

Updated On 20 Feb 2024 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story