పాకిస్తాన్‌లో(Pakistan) దుండగుల కాల్పులకు 23 మంది బలయ్యారు.

పాకిస్తాన్‌లో(Pakistan) దుండగుల కాల్పులకు 23 మంది బలయ్యారు. బలూచిస్థాన్‌-పంజాబ్‌ జాతీయ రహదారిపై వాహనాలను ఆపిన దుండగులు బస్సులు, ట్రక్కుల్లో వెళుతున్న వారిని బలవంతంగా కిందకు దించారు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో(firing) మరో అయిదుగురికి గాయాలయ్యాయి. అంతేకాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. మృతుల్లో 19 మంది పాకిస్తాన్‌ పంజాబీలు, ముగ్గురు బలూచిస్థాన్‌ వాసులున్నారు. మృతుల్లో ఎక్కువగా పాక్‌ పంజాబీ కూలీలు ఉన్నట్లు గుర్తించారు. ముష్కరులు-ప్రమాణికుల బృందంపై ఆరా తీసినట్లు పాకిస్తాన్‌ అధికారి వెల్లడించారు. బలూచిస్థాన్‌ సీఎం సర్ఫరాజ్‌ బుగ్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

Eha Tv

Eha Tv

Next Story