పాలు కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. పాలు తాగని వారు, అదే పాలనుండి వచ్చిన పెరుగును మాత్రం తింటారు. ఇక కొందరు పాలు తాగరు, పెరుగు తినరు. కానీ.. పెరుగు నుండి చేసిన మజ్జికను మాత్రం తెగ తాగుతుంటారు. ఎందుకు అంటే..? ఈ మూడింటి మధ్య తేడాలు చాలా ఉన్నాయి కాబట్టి. అవి అందించే పోషకాలు కూడా భిన్నంగా ఉంటాయి. మరి పెరుగు తినడం కంటే కూడా మజ్జిక తీసుకుంటేనే మంచిది అని అందరు ఎందుకు అంటారు […]

పాలు కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. పాలు తాగని వారు, అదే పాలనుండి వచ్చిన పెరుగును మాత్రం తింటారు. ఇక కొందరు పాలు తాగరు, పెరుగు తినరు. కానీ.. పెరుగు నుండి చేసిన మజ్జికను మాత్రం తెగ తాగుతుంటారు. ఎందుకు అంటే..? ఈ మూడింటి మధ్య తేడాలు చాలా ఉన్నాయి కాబట్టి. అవి అందించే పోషకాలు కూడా భిన్నంగా ఉంటాయి. మరి పెరుగు తినడం కంటే కూడా మజ్జిక తీసుకుంటేనే మంచిది అని అందరు ఎందుకు అంటారు అంటే.. పెరుగు నుండి మజ్జిగను తయారు చేసినప్పుడు అందులో మార్పులు రావడమే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుకు, మజ్జికకు తేడా ఏంటి..?
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వేడిని తాకినప్పుడు పులియబెడుతుంది. అది కడుపులోకి వచ్చినపుడు కూడా పొట్టలోని వేడి ఆమ్లాలు కారణంగా పులియబెట్టడం జరుగుతుంది. దాని వల్ల పేగులు వేడెక్కుతాయి. కానీ పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లబరుస్తుందని అంటారు. మజ్జిగ అన్ని రకాల శరీరాలకు, సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనదని స్పష్టం చేశారు. పెరుగు కొవ్వు, బలాన్ని పెంచుతాయి. వాత అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగుని అందరూ తినలేరు.

ఎవరు తినకూడదు?
ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పెరుగుకి దూరంగా ఉండాలి. అంతే కాదు రాత్రిపూట పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం నొక్కి చెప్తుంది. ఎందుకంటే ఇది జలుబు, దగ్గు, సైనస్ లు ప్రేరేపిస్తుంది. ఒకవేళ రాత్రిపూట పెరుగు తినకుండా ఉండలేరని అనుకుంటే అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకుని తినడం అలవాటు చేసుకోవాలి.
పెరుగుని వేడి చేయకూడదు. అందులొనీ మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కొంతమంది పెరుగుని వేడి చేసి మజ్జిగ చారు వంటివి తయారు చేస్తారు. అయితే అది తరచూ తింటున్న వారి శరీరం మాత్రమే తట్టుకోగలదు.

చర్మ రుగ్మతలు, పిత్త అసమతుల్యత, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు పెరుగు తినకపోవడం మంచిది.

మజ్జిగ తింటే ప్రయోజనాలు ఏంటి..?

ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధులను నయం చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. వాపు, జీర్ణ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఆకలి లేకపోవడం, రక్తహీనత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. చలికాలంలో అయితే అజీర్ణం సమస్య రాకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం కావడం సులభం. ఆకలిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక

బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు పెరగాలంటే పెరుగు తగ్గాలంటే మజ్జిగ ఎంచుకోవాలి. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. వేడికి దూరంగా ఉంచుతుంది.

గమనిక: ఇది ఎవరు వ్యక్తిగతంగా తీసుకోకూడదు. పలు పుస్తకాలల్లో ఆయుర్వేద నిపుణులు చెప్పిన వాటి ఆధారంగానే మీకు అందిస్తున్నాం. మీరు ఇది పాటించాలి అనుకుంటే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే పాటించగలరు. ఈ సమాచారంతో మీరు ఎంతో కొంత తెలుసుకుంటారని మాత్రమే ఇస్తున్నాం

Updated On 9 Feb 2023 3:01 AM GMT
Ehatv

Ehatv

Next Story