సమ్మర్‌లో చాలా మందికి నీరు జ్యూస్‌లు, డ్రింక్స్ తాగాలని ఉంటుంది. అలాంటప్పుడు హెల్దీగా చింతపండు రసం తాగితే ఏ లాభాలున్నాయో తెలుసుకోండి

సమ్మర్‌లో చాలా మందికి నీరు జ్యూస్‌లు, డ్రింక్స్ తాగాలని ఉంటుంది. అలాంటప్పుడు హెల్దీగా చింతపండు రసం తాగితే ఏ లాభాలున్నాయో తెలుసుకోండి.

చింతపండు రసం.. ఈ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ఈ నీటిని తాగితే చాలా మంచిది. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. అవన్నీ ఏంటో తెలుసుకోండి.

హైడ్రేషన్..

ఎక్కువ శాతం నీటితో తయారైన మన బాడీకి హైడ్రేషన్ చాలా ముఖ్యం. సమ్మర్‌లో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చింతపండు నీరు తాగాలి. దీని వల్ల డీహైడ్రేషన్‌ని తగ్గించుకోవచ్చు.

విటమిన్స్..

చింతపండులో విటమిన్ సి, ఎ, థయామిన్, రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తాగండి.

బీపి..

చింతపండు నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ నీటిని రెగ్యులర్‌గా తాగితే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు చాలా సమస్యల్ని దూరమవుతాయి. అంతేకాకుండా, ఇందులోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గౌట్ వంటి సమస్యలు దూరమై మంట, నొప్పులు తగ్గుతాయి.

జీర్ణక్రియ..

సమ్మర్‌లో చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్స్ ఉత్తేజితమవుతాయి. దీంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమై జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో పాటు ఈ నీరు తాగితే బాడీ చల్లగా ఉంటుంది. దీంతో వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు అలసట, తలనొప్పి, తలతిరగటం వంటివి దూరమవుతాయి.

శరీర బరువు..

చింతపండు నీరు తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఎందుకంటే, ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినలేరు. జీవక్రియ పెరుగుతుంది. అయితే, లాభాలున్నాయి కదా అని ఎక్కువగా తాగొద్దు.

ehatv

ehatv

Next Story