సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) రేపు వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించ‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రేపు ఉద‌యం 9 గంటలకు సీఎం జ‌గన్‌ తాడేపల్లి(thadepalli) నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు.

సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) రేపు వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించ‌నున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రేపు ఉద‌యం 9 గంటలకు సీఎం జ‌గన్‌ తాడేపల్లి(thadepalli) నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 1 Sep 2023 4:20 AM GMT
Ehatv

Ehatv

Next Story