హైదరాబాద్ నగర వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తీపికబురు చెప్పింది.

హైదరాబాద్ నగర వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తీపికబురు చెప్పింది. తిరుమల లడ్డూ(Trupathi laddu) ప్రతిరోజూ హైదరాబాద్‌లో లభ్యం కానుంది.

ఇంతకు మునుపు హిమాయ‌త్‌న‌గ‌ర్‌, జూబ్లీహిల్స్‌లోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో కేవ‌లం శ‌ని, ఆదివారాల్లో మాత్ర‌మే శ్రీవారి ల‌డ్డూ అమ్మేవారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఇప్పట్నుంచి ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో లడ్డూను 50 రూపాయలకు విక్రయించనున్నారు.. హిమాయ‌త్‌న‌గ‌ర్, జూబ్లీహిల్స్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ల‌డ్డూ విక్ర‌యాలు కొన‌సాగుతాయ‌ని టీటీడీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌ ప్రభు, నిరంజన్‌ కుమార్‌ తెలిపారు. భ‌క్తులు గ‌మ‌నించి, ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కొనుగోలు చేయాల‌ని సూచించారు.

Eha Tv

Eha Tv

Next Story