తిరుమల(Tirumala) భక్తులతో(Devotees) కిటకిటలాడుతోంది.

తిరుమల(Tirumala) భక్తులతో(Devotees) కిటకిటలాడుతోంది. దసరా సెలవులు(Dasara Celebrations) ముగిసినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి కంపార్టుమెంట్లన్నీ నిండాయి. వెలుపల క్యూలైన్‌లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తున్నది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు అయిదు గంటల్లో దర్శనం లభిస్తున్నది. కాగా, బుధవారం వీఐపీ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. నేడు సిఫారసు లెటర్లను తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.

Eha Tv

Eha Tv

Next Story