ఆదివారం ఫిబ్రవరి 25వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో(Thiruvananthapuram) బ్రహ్మండమైన వేడుక జరిగింది. 15 లక్షల మందికిపైగా మహిళలు ఆ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. ఆ ఉత్సవం జరిగింది తిరువనంతపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆట్టుక్కాల్‌ (Attukal)అమ్మవారి దేవాలయంలో! ఈ ఆలయానికి అతివల శబరిమలగా పేరుంది. ఈ రోజున ఆట్టుక్కాల్‌ అమ్మవారి దేవాలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. ఆదివారం అక్కడ పొంగల ఉత్సవం జరిగింది. ఎంతో వైభవోపేతంగా జరిగిన ఈ ఉత్సవంలో 15 లక్షల మందికిపైగా భక్తురాళ్లు పాల్గొన్నారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు.

ఆదివారం ఫిబ్రవరి 25వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో(Thiruvananthapuram) బ్రహ్మండమైన వేడుక జరిగింది. 15 లక్షల మందికిపైగా మహిళలు ఆ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. ఆ ఉత్సవం జరిగింది తిరువనంతపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆట్టుక్కాల్‌ (Attukal)అమ్మవారి దేవాలయంలో! ఈ ఆలయానికి అతివల శబరిమలగా పేరుంది. ఈ రోజున ఆట్టుక్కాల్‌ అమ్మవారి దేవాలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. ఆదివారం అక్కడ పొంగల ఉత్సవం జరిగింది. ఎంతో వైభవోపేతంగా జరిగిన ఈ ఉత్సవంలో 15 లక్షల మందికిపైగా భక్తురాళ్లు పాల్గొన్నారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. నైవేద్యాన్ని అప్పటికప్పుడు అక్కడికక్కడ వండి అమ్మవారికి నివేదించారు. పొంగల పండుగలో ఇది కూడా ఓ ప్రత్యేకత! ముహూర్త సమయానికి చాలా ముందుగానే మహిళలకు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చోటు దొరకని వాళ్లు బయట ఆలయ పూజారుల అనౌన్స్‌మెంట్‌ (Announcement)కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ముందుగానే అక్కడి ప్రదేశాన్ని శుభ్రపరచుకుని, చక్కటి రంగవల్లికతో తీర్చి దిద్దుకున్నారు. ఇటుకలతో పొయ్యిని (Brick Stove)పేర్చుకున్నారు. కొత్త కుండ, కొత్త బియ్యం.. బెల్లం, పాలు, ఎండుకొబ్బరి, ఆకులతో ఉన్న కొబ్బరి మట్ట, పూజసామాగ్రిని తమ వెంట తెచ్చుకున్నారు. కొత్త కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకున్నారు. ఆలయ పూజారుల అనుమతి రాగానే మహిళలు పొయ్యిని వెలిగించారు. బెల్లం పొంగల్‌ తయారీలో నిమగ్నమయ్యారు. పొంగల్‌ తయారైన తర్వాత దాన్ని ఓ అరటి ఆకులో పెట్టి అమ్మవారికి నైవేద్యమిచ్చారు.ఈ సమయంలో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు(Songs) పాడారు. అర్చకులు వచ్చి మహిళలు భక్తితో సమర్పించిన నైవేద్యాన్ని సంప్రోక్షించారు. అమ్మవారికి నివేదించారు. ఒక్క కేరళీయులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వచ్చారు. అమ్మవారికి నైవేద్యం అర్పించి, ఆమె కరుణాకటాక్షాల కోసం ప్రార్థనలు (Prayers)చేశారు.
ఆట్టుక్కాల పొంగల గురించి తెలుసుకునే ముందు ఆలయ స్థలపురాణాన్ని తెలుసుకుందాం! ఇప్పుడైతే తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది కానీ ఆట్టుక్కాల్‌ పట్టణం ఒకప్పుడు చిన్న గ్రామం. కొన్ని వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతాన్ని మల్లవీట్టిల్‌ వంశస్తులు పాలిస్తుండేవారు. ఓనాడు వంశపెద్ద సమీపంలోని కిళ్లినదిలో(River Kelli) స్నానం చేస్తుండగా ఓ చిన్నారి నది దాటించమని అడిగిందట! ముద్దులొలికే ఆ పాపను చూసి ముచ్చటపడిన ఆ పెద్దాయన ఆ పాపను ఇంటికి తీసుకెళ్లారట! కుటుంబసభ్యులంతా ఆ చిన్నారిని అక్కున చేర్చుకున్నారట! రాత్రి భోజనాల తర్వాత ఆమె ఎవరికీ కనిపించలేదట! రాత్రి కలలో పెద్దాయనకు కనిపించి... దగ్గరున్న తోటలో(Farm) ఎక్కడ మూడు గీతలు కనిపిస్తాయో అక్కడ గుడి(Temple) కట్టమని చెప్పిందట! తెల్లారి తోటలో కలయతిరిగిన పెద్దాయనకు ఓ చోట మూడు గీతలు కనిపించాయట! అక్కడో ఆలయాన్ని నిర్మించారట! ఆ బాలిక ఎవరో కాదు, పాండ్యరాజును శపించి మధురైను తన కోపాగ్నితో భస్మం చేసిన కన్నగి అట! అట్టుక్కాల భగవతి తమిళ ఆడపడచు కావడం వల్ల ఈ ఆలయం కేరళ ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. వివిధ శిల్పాలతో ఎత్తయిన గోపురాలతో ఉంటుంది ఆలయంలో గానం చేసే తొట్టెంపట్టు ప్రార్థన గీతంలో వినిపించేది కన్నగి జీవితగాధే!
పొంగల్‌ వేడుక విషయానికి వస్తే ఆలయం నిర్మించిన తొలినాళ్లలో ఓ రోజు కొందరు మహిళలు(Women) పొలం పనులు చేసుకుంటుంటే, నదిలో కాళ్లను ఉంచి ఆడుకుంటున్న ఓ మహిళ కనిపించిందట! ఆమె వారిని పిలిచి ఆకలిగా ఉందని ఏదైనా ఉంటే పెట్టమని అడిగిందట! ఆమె తేజోమయ రూపాన్ని చూసిన మహిళలు తాము తెచ్చుకున్న ఆహారం కాకుండా అప్పటికప్పుడు బియ్యం, పాలు, బెల్లంతో మట్టికుండలో పాయసం వండారట! అయితే వండిన తర్వాత ఆ మహిళ కనిపించలేదట! వచ్చింది ఎవరో కాదనీ, భగవతి అమ్మవారేనని తెలుసుకున్న మహిళలు అప్పట్నుంచి ఆ రోజున పాయసం వండి సమర్పించుకోసాగారట! అది ఆనవాయితీగా మారింది! అమ్మవారు కాళ్లు కడుక్కున్న ప్రదేశం కావడం వల్ల అట్టుక్కాల్‌ అన్న పేరు వచ్చిందంటారు. ఉత్సవాలలో మొదటి తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలు,అభిషేకాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural events) చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. పదో రోజున తెల్లవారక ముందే ఆలయానికి దారి తీసే రహదారులన్ని మహిళలతో కిక్కిరిసిపోతాయి. ఒక్క రహదారులేమిటి ఎక్కడ జాగా దొరికితే అక్కడ పొయ్యి పెట్టేసుకుని పొంగలి వండేస్తారు. సాయంత్రం అమ్మవారు స్వయంగా వచ్చి అందరి నైవేద్యాలను ఆరగిస్తారన్నది భక్తురాళ్ల విశ్వాసం. 20 ఏళ్ల కిందట అత్యధికంగా పదిహేను లక్షల మంది మహిళలు పొంగల వేడుకలో పాల్గొన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు అంతకంటే ఎక్కువమంది పాల్గొన్నారు. అందుకే ఈ ఉత్సవం గిన్నిస్‌ రికార్డులలో(Guinness Record) చోటు చేసుకుంది.విశాలమైన ఆవరణలో నిర్మించిన ఈ ఆలయంలో అణువణువూ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. గర్భాలయంలో రెండు భగవతి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. అందమైన అలంకరణలతో కనిపించే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించింది వీట్టిల్‌ వంశస్తులు. పనస చెట్టు కాండంతో అమ్మవారి మూర్తిని మలిచారు.రెండోది పంచలోహ విగ్రహం. ప్రతి రోజు ఉదయం నాలుగున్నరకే సుప్రభాత స్తోత్రంతో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. నిర్మాల్య దర్శనం, అభిషేకాలు, గణపతి హోమం, దీపారాధన, చందనాభిషేకం, పతిరాడి పూజ, ఉష్:పూజ, ఉచ్చ:పూజ, అతళ పూజ ఇవన్నీ యధావిధిగా జరుగుతాయి. ఇక ఆర్జిత సేవలలో ముఖ్యమైనవి ములక్కప్పు, చందనాభిషేకం. ఈ సేవలను అమ్మవారికి జరిపించాలంటే కనీసం పాతిక సంవత్సరాలైనా ఎదురుచూడాలి.

Updated On 26 Feb 2024 5:37 AM GMT
Ehatv

Ehatv

Next Story