మేడారంలో(Medaram) భక్త జనం(Piligrims) పోటెత్తుతున్నారు. మేడారం జనసంద్రంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘ శుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు(Warangal) 110 కిలోమీటర్ల దూరంలో.. మేడారం కీకారణ్యంలో. ప్రతి రెండేళ్లకోసారి ఈ మహా జాతర జరుగుతుంది.

మేడారంలో(Medaram) భక్త జనం(Piligrims) పోటెత్తుతున్నారు. మేడారం జనసంద్రంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘ శుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు(Warangal) 110 కిలోమీటర్ల దూరంలో.. మేడారం కీకారణ్యంలో. ప్రతి రెండేళ్లకోసారి ఈ మహా జాతర జరుగుతుంది. రేపటి నుంచి మొదలయ్యే ఈ సమ్మక్క సారలమ్మ జాతర(Samakka Saralamma Jathara) 24వ తేదీ వరకు జరుగుతుంది.
మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు.
మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం మహానగరంగా మారిపోతుంది.

Updated On 20 Feb 2024 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story