హైదరాబాద్‌(Hyderabad)లో వినాయకుడి శోభాయాత్ర శోభాయమానంగా సాగుతోంది. హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar)వైపు తరలివెళుతున్న గణపతి మూర్తులను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హైదరాబాద్‌ అంతటా ఆధ్యాత్మిక శోభే! ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా వినాయకుడి లడ్లూ రికార్డు ధర పలికింది.

హైదరాబాద్‌(Hyderabad)లో వినాయకుడి శోభాయాత్ర శోభాయమానంగా సాగుతోంది. హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar)వైపు తరలివెళుతున్న గణపతి మూర్తులను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హైదరాబాద్‌ అంతటా ఆధ్యాత్మిక శోభే! ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా వినాయకుడి లడ్లూ రికార్డు ధర పలికింది. బండ్లగూడ జారీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న కీర్తి రిచ్‌ మండ్‌ విల్లాలో ఉన్న వినాయకుడి లడ్డూను వేలంలో కోటి 20 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడో భక్తుడు. అలాగే మాదాపూర్‌లోని మైహోం భుజ్‌లో ఉన్న లడ్డూ 25.50 లక్షల రూపాయలు పలికింది. చిరంజీవి గౌడ్‌ అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకున్నాడు. నిరుడు 18.50 లక్షలకు అమ్మడయ్యిన లడ్డూ ఈసారి ధర మరింత పెరిగింది.

Updated On 27 Sep 2023 11:18 PM GMT
Ehatv

Ehatv

Next Story