సంఘటన జరిగిన రోజు.. గర్విత్, నందిని షూటింగ్ ముగించుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చారు

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. బహదూర్‌గఢ్‌లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్న జంట.. తమ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి మరణించారు. గర్విత్ (25), నందిని (22)కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సైట్స్ కోసం షార్ట్ వీడియోలను రూపొందిస్తూ.. కంటెంట్ సృష్టికర్తలుగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఈ జంట ఇటీవలే డెహ్రాడూన్ నుండి బహదూర్‌ఘర్‌కు వచ్చారు. వారి ఐదుగురు సహచరులతో కలిసి ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.

సంఘటన జరిగిన రోజు.. గర్విత్, నందిని షూటింగ్ ముగించుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఏదో ఓ విషయం గురించి వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఉదయం 6 గంటల సమయంలో భవనంపై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. దంపతులు బహదూర్‌ఘర్‌లోని రుహిల్ రెసిడెన్సీలో నివసిస్తున్నారు. పోలీసులు వారి మృతదేహాలను శవపరీక్ష కోసం పంపించారు. సంఘటన గురించి వారి కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. కేసును విచారించేందుకు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. భవనంలోని చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తారు.

Updated On 13 April 2024 8:29 PM GMT
Yagnik

Yagnik

Next Story