ములుగు జిల్లా వెంకటాçపురం(m) పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్‌ (Bashaboina Srinivas)గతంలో వెంకటాపురం(k) పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించాడు.

ములుగు జిల్లా వెంకటాçపురం(m) పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్‌ (Bashaboina Srinivas)గతంలో వెంకటాపురం(k) పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయంపై నిర్మల (Nirmala)భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్‌ (Sai Prakash)ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్‌ చేశారు. ఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్‌ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్‌లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్‌ స్కూల్‌ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్‌ చేసి హసన్‌పర్తి (Hasanparthi)పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్‌ పీఎస్‌ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ (Hanumakonda)ఏషియాన్‌ మాల్‌ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. ప్రధాన నిందితుడు కానిస్టేబుల్‌ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్‌ అలియాస్‌ పండు, బాదావత్‌ అఖిల్‌ నాయక్, బాదావత్‌ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story