హైద‌రాబాద్‌ మాదాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. యువ‌తి తన స్నేహితుడితో కలిసి సరదాగా బండిపై వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది.

హైద‌రాబాద్‌(Hyderabad) మాదాపూర్(Madhapur) లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. యువ‌తి తన స్నేహితుడితో కలిసి సరదాగా బండిపై వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. కలకత్తాకి చెందిన స్వీటీ పాండే (22) అనే యువ‌తి తన స్నేహితుడైన రాయన్ తో కలిసి బైక్‌పై వేగంగా వెళుతున్న క్ర‌మంలో.. బైక్ ఒక్కసారి గా అదుపుతప్పి హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ వెనక కూర్చున్న స్వీటీ పాండే(Sweety Pandey) ఒక్కసారిగా ఎగిరి ఫ్లైఓవర్ పై నుండి కింద పడిపోవ డంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న రాయన్ కి ఫ్లైఓవర్ గోడ తాకడంతో గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన స్వీటీని పోలీసులు స్థానిక హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్వీటీ మృతి చెందింది. మాదాపూర్ పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Updated On 18 Aug 2023 3:53 AM GMT
Yagnik

Yagnik

Next Story