ఓ యువకుడు ఉన్నత విద్యను చదువకున్నాడు. కానీ పెద్ద ఉద్యోగం రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం ఖర్చులకూ సరిపోవడం లేదు.

ఓ యువకుడు ఉన్నత విద్యను చదువకున్నాడు. కానీ పెద్ద ఉద్యోగం రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం ఖర్చులకూ సరిపోవడం లేదు. మంచి ఉద్యోగం లేదని వచ్చిన పెళ్లి సంబంధాలు రద్దువుతున్నాయి. దీంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం వరంగల్‌(Warangal) జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన ఇంగోళి రాజేశ్వర్‌రావు(rajeswarao), పద్మ (Padma)దంపతుల కుమారుడు వేణు(Venu)(30) బీటెక్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించి చివరికి తక్కువ జీతానికి హైదరాబాద్‌(Hyderabad)లో ఓ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అయితే వేతనం ఖర్చులకు సరిపోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చి తన తండ్రికి చెప్పడంతో వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఓదార్చాడు. వ్యవసాయ పనులు చేయలేక పోయాడు. ఏ పనిచేయలేక తల్లిదండ్రులకు భారంగా మారానని మదనపడుతున్నాడు. మరోవైపు వేణు పెళ్లి కోసం అనేక సంబంధాలు చూశారు. అయితే తనది చిన్న ఉద్యోగం.. చాలీ చాలని జీతం అని పిల్లనివ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకాడారు. ఇలా మూడు, నాలుగు సంబంధాలు రద్దయ్యాయి. ఇక తనకు పెళ్లికాదని మనస్తాపంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన మృతుడి అమ్మమ్మ లచ్చమ్మ దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పి తలుపులు తీయించింది. వేణును కిందికి దించి చూడగా.. అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఎదిగొచ్చిన కొడుకు బలవన్మరణానికి రాజేశ్వరరావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ehatv

ehatv

Next Story