మైనర్ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు పారిపోయిన 27 ఏళ్ల మహిళని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని హనుమాన్ నగర్‌లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న రాధగా గుర్తించారు. నివేదికల ప్రకారం.. 16 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని కుటుంబం జనవరిలో ఫిర్యాదు చేసింది. వారి ఇంట్లో అద్దెకు ఉన్న మహిళపై అనుమానాలు వచ్చాయి.

తదుపరి విచారణలో ఆమె చెన్నైలో కలిసి జీవిస్తున్నట్లు తేలింది. పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలిసి సిద్దిపేటకు తిరిగి వచ్చింది. వారు తిరిగి రావడం గురించి పోలీసులకు తెలిసింది. వారు బాలుడిని విచారించగా ఆమెతో కలిసి చెన్నైలో అద్దె అపార్ట్మెంట్లో నివసించినట్లు అంగీకరించాడు. ఈ నెల ప్రారంభంలో, నిందితురాలు నగదు దొంగిలించమని బాలుడిని బలవంతం చేసింది. బాలుడు 30 తులాల వెండి, మూడు తులాల బంగారం, రూ.40 వేల నగదును ఇంట్లో దొంగిలించగా.. ఇద్దరూ కలిసి చెన్నైకు వెళ్లిపోయారు. ఇక అత్యాచారం, పోక్సో చట్టం ఉల్లంఘన కింద మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Eha Tv

Eha Tv

Next Story