సహజీవనం చేసిన ప్రియుడు తనను వదిలేసి సొంత భార్య, కొడుకు దగ్గరికి వెళ్లిపోవడంతో ఆ ప్రియురాలు ఊహించని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడితో గొడవ పడదామని అతని ఇంటికి వెళ్ళగా.. అక్కడ ఒంటరిగా ఉన్న అతని కొడుకుని చూసి హత్య చేసేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది.

సహజీవనం చేసిన ప్రియుడు తనను వదిలేసి సొంత భార్య, కొడుకు దగ్గరికి వెళ్లిపోవడంతో ఆ ప్రియురాలు ఊహించని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడితో గొడవ పడదామని అతని ఇంటికి వెళ్ళగా.. అక్కడ ఒంటరిగా ఉన్న అతని కొడుకుని చూసి హత్య చేసేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది.

పూజా కుమారి అనే 24 ఏళ్ల యువతికి జితేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2019 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత జితేందర్ పూజను వదిలేసి తన భార్య వద్దకు వెళ్లిపోయాడు. దీంతో పూజ ఆగస్ట్ 10న జితేంద్ర ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్లే సమయానికి ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. జితేందర్ కొడుకు 11 సంవత్సరాల వయస్సున్న పిల్లాడు బెడ్ మీద పడుకుని నిద్ర పోతున్నాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం గమనించిన పూజ అబ్బాయి గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత బట్టలతో పాటు అబ్బాయి డెడ్ బాడీని ఒక బాక్స్ లో పెట్టి పారిపోయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల సహకారంతో ఒక మహిళ ఆ ఇంటికి వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఇంద్రపురితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ఆ ప్రాంతంలోనే ఉందని.. ఉండే ప్రదేశాలను తరచుగా మారుస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులను వదిలేసి చాలా కాలం అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడు రోజుల తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated On 16 Aug 2023 9:32 AM GMT
Yagnik

Yagnik

Next Story