సదానంద్‌తో పెళ్లికి ముందు నుంచి సాయినాథ్‌తో తనకు సంబంధం ఉందని, పెళ్లి తర్వాత

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను చంపేసి లవర్ తో పారిపోవాలని అనుకుంది. అయితే ఆమెను ఎట్టకేలకు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు-ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలను చంపినందుకు ఆమెను అరెస్టు చేశారు. శీతల్ పోల్ అనే మహిళకి సదానంద్ తో పెళ్లి చేశారు. అయితే ఆమె తన ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూ ఉంది. తన ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పిల్లలు తనకు అడ్డుగా ఉన్నారని భావించి వారిని చంపేశానని పోలీసుల ఎదుట అంగీకరించింది. అపస్మారక స్థితిలో కనిపించిన చిన్నారులను రాయ్‌గఢ్‌లోని అలీబాగ్ సివిల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే ఆ పిల్లలు మృతి చెందినట్లు ప్రకటించారు.

అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సోమ్‌నాథ్ లాండే వైద్యులతో మాట్లాడగా.. పిల్లల మృతిలో అనుమానాలు ఉన్నట్లు గుర్తించారు. అతను రాయగడ పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గేకు సమాచారం అందించాడు.. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాలని స్థానిక క్రైమ్ బ్రాంచ్ పిఐ బాలాసాహెబ్ ఖాడేను కోరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదానంద్ వాంగ్మూలాన్ని నమోదు చేయగా ఘటన జరిగిన రోజు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వీక్లీ మార్కెట్‌కు వెళ్లినట్లు తెలిపాడు. అతను తన ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కొడుకు కోసం మిఠాయిలు మరియు చెప్పులతో తిరిగి వచ్చాడు. సదానంద్ ఇంటికి తిరిగి వచ్చేసరికి, శీతల్ ఇంటి పనులు ముగించుకుని ఉంది. పిల్లల గురించి అడిగితే.. లోపల వారు నిద్రిస్తున్నారని చెప్పింది. సాయంత్రం 6 గంటల నుంచి పిల్లలు నిద్రపోతున్నారని, తన భర్త వెళ్లిన తర్వాత ఇంట్లోకి ఎవరూ రాలేదని, పిల్లలు కూడా బయటకు వెళ్లలేదని శీతల్ పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానం రావడంతో పోలీసులు చిన్నారుల మృతదేహాలను శవపరీక్షకు తరలించారు.

రోజుల తరబడి సదానంద్‌, శీతల్‌లను విచారించినా చిన్నారుల మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారి వివాహం, ఇతర వ్యక్తిగత వివరాలను ఆ జంటను అడిగారు. పోలీసులు శీతల్ ఫోన్‌ను పరిశీలించగా సాయినాథ్ జాదవ్ అనే వ్యక్తి నుండి వచ్చిన మెసేజ్‌లు, కాల్‌లను గుర్తించారు. అనంతరం శీతల్ తల్లిదండ్రులు, సాయినాథ్‌ను విచారణ నిమిత్తం మాండ్వాకు తీసుకొచ్చారు. శీతల్ మీద అనుమానంతో ప్రశ్నించడంతో పిల్లలను చంపినట్లు ఆమె అంగీకరించింది. టవల్‌తో ఊపిరాడకుండా చేసి చంపేశానని పోలీసులకు చెప్పింది. శవపరీక్ష నివేదికలో చిన్నారులు ఊపిరాడక చనిపోయారని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

సదానంద్‌తో పెళ్లికి ముందు నుంచి సాయినాథ్‌తో తనకు సంబంధం ఉందని, పెళ్లి తర్వాత కూడా తన ప్రేమికుడితో టచ్‌లో ఉన్నానని శీతల్ వెల్లడించింది. సాయినాథ్ జాదవ్‌తో కలిసి పారిపోవడానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని తాను భావించినట్లు శీతల్ ఒప్పుకుంది. తన భర్త మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఆమె తన పిల్లలను హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

Updated On 9 April 2024 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story