ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భార్యాభర్తల మధ్య అర్థరాత్రి జరిగిన హైవోల్టేజీ డ్రామాకు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భార్యాభర్తల మధ్య అర్థరాత్రి జరిగిన హైవోల్టేజీ డ్రామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రియురాలితో కలిసి భోజనం చేసేందుకు భర్త రెస్టారెంట్‌కు వెళ్లాడు. అదే సమయానికి అతని భార్య కూడా రెస్టారెంట్‌కు రావడంతో గొడవ కాస్తా పెద్దదైంది. భర్తను, అతని ప్రియురాలిని రెస్టారెంట్ నుంచి బయటకు లాక్కొని వచ్చింది భార్య. తన తమ్ముడి సహాయంతో వారిద్దరినీ రోడ్డుపైనే ఇష్టమొచ్చినట్లు కొట్టింది మహిళ. ఈ హైవోల్టేజీ డ్రామా కొన్ని గంటల తరబడి కొనసాగింది. పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు శాంతింపజేశారు.

బీడీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజాబాద్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బారాబంకి నివాసి తన ప్రియురాలితో కలిసి రాత్రి భోజనం చేసేందుకు ఇక్కడికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత, ఈ డిన్నర్ డేట్ కాస్తా దెబ్బల డేట్ గా మారిపోయింది. భార్య, బావమరిదిని చూసిన భర్త షాక్‌కు గురయ్యాడు. భార్య, బావమరిది ఇద్దరినీ ఈడ్చుకెళ్లి రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకొచ్చి భర్తను దారుణంగా కొట్టారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 10 Jun 2024 11:47 PM GMT
Yagnik

Yagnik

Next Story