భారతదేశానికి చెందిన 37 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

భారతదేశానికి చెందిన 37 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అబుదాబీలో ప్రాణాలు కోల్పోయింది. ఫుజైరాలోని సెయింట్ మేరీస్ కాథలిక్ హై స్కూల్ సమీపంలో తన భవనంలోని 19వ అంతస్తు పై నుండి కిందకు పడి మరణించింది. మృతురాలు కేరళలోని తిరువనంతపురం వాసి 'షనీఫా బాబు' గా గుర్తించారు. ఈ సంఘటన మే 25, శనివారం ఉదయం జరిగింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఫుజైరాలో కన్‌స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్న సనూజ్ బాబుకు షనీఫా భార్య.. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

"ఏమి జరిగిందో మాకు తెలియదు," అని కుటుంబ స్నేహితుడు చెప్పారు. ఈ సంఘటన ఉదయం 9 గంటలకు జరిగింది.. ఆమె భర్త, తల్లి, పిల్లలు ఆ సమయంలో అపార్ట్మెంట్లో ఉన్నారు. షానీఫా UAEలో పెరిగారు. ఆమె కుటుంబం మొత్తం ఇక్కడే నివసిస్తుందన్నారు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ రెండింటిలోనూ షానిఫా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెండు ప్లాట్‌ఫారమ్‌లలో 90,000 కంటే ఎక్కువ మంది ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె క్రమం తప్పకుండా ఫన్నీ రీల్స్, తన కుటుంబంతో తన జీవితం గురించి పోస్ట్ చేస్తుంది. ఆమె చివరి సోషల్ మీడియా పోస్ట్ గురువారం టిక్‌టాక్‌లో లో ఉంది.

Updated On 26 May 2024 9:44 AM GMT
Yagnik

Yagnik

Next Story