దేశ రాజధాని ఢిల్లీలోని వెల్‌కమ్‌లోని కబీర్ నగర్‌లో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పాత రెండంతస్తుల భవనం కుప్పకూలింది.

దేశ రాజధాని ఢిల్లీలోని వెల్‌కమ్‌లోని కబీర్ నగర్‌లో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పాత రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడగా.. వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయిందని మధ్యాహ్నం 2.16 గంటలకు తనకు కాల్ వచ్చిందని ఈశాన్య డీసీపీ జాయ్ టిర్కీ తెలిపారు. దీంతో వెంట‌నే సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం GTB ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అర్షద్ (30), తౌహీద్ (20) అనే ఇద్ద‌రు వ్య‌క్తులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని ఆయ‌న వెల్ల‌డించారు. తీవ్రంగా గాయపడిన రెహాన్ (22) చికిత్స పొందుతున్నాడు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్ల‌డించారు.

Updated On 20 March 2024 9:34 PM GMT
Yagnik

Yagnik

Next Story