ఇద్దరి యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ హత్యవరకు దారి తీసింది. యువతి పేరుతో ట్రాప్‌ చేసి యువకుడిని పిలిచి హత్య చేసి పగ తీర్చుకున్నాడు మరో యువకుడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అత్తాపూర్‌ పోలీసులు(Attapur Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.

ఇద్దరి యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ హత్యవరకు దారి తీసింది. యువతి పేరుతో ట్రాప్‌ చేసి యువకుడిని పిలిచి హత్య చేసి పగ తీర్చుకున్నాడు మరో యువకుడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అత్తాపూర్‌ పోలీసులు(Attapur Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. రాజేంద్రనగర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బాలాపూర్(Balapur) నివాసి ఫహీం(Tafheem) వృత్తిరీత్యా పెయింటర్‌. ఫిబ్రవరిలో జరిగిన జగ్నేకి రాత్‌కు ఫహీం వచ్చారు. ఈ కార్యక్రమంలో యాసిన్‌(Yaseen) అనే యువకుడితో ఫహీంకు ఘర్షణ జరిగింది. అక్కడే ఉన్నవారు సముదాయించినా ఓ యువకుడి కోపం మాత్రం తగ్గలేదు. ఫహీంను ఎలాగైనా చంపాలని యాసిన్‌ ప్లాన్‌ వేశాడు. ఇందుకు అతని స్నేహితులు మహ్మద్ అబ్దుల్, ఖయ్యూం, మహ్మద్‌ ఫహీం, ఖురేషి సహాయం తీసుకున్నాడు. ఫహీంను ట్రాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఓ యువతి పేరుతో ఇన్‌స్టాలో నకిలీ ఖాతా తెరిచి ఫహీంతో చాటింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు సులేమాన్‌నగర్‌లోని ఎం.ఎం.పహాడ్‌కు రావాలని ఫహీంను ఆహ్వానించారు. తనను యవతే పిలుస్తోందని భ్రమపడి నిందితులు చెప్పిన లొకేషన్‌కు ఫహీం చేరుకున్నాడు. ఫహీం చేరుకోగానే ఒక్కసారిగా అతనిపై దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య కేసును విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 8 March 2024 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story