హైద్రాబాద్(Hyderabad) టోలిచౌకీ(Tolichowki)లో తీవ్ర విషాదం(Tragedy) నెల‌కొంది. బుధవారం రాత్రి ఓ ఇంట్లో విద్యుదాఘాతం (Electrocution) తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో టోలిచౌకీ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పారామౌంట్‌ కాలనీ(Paramount colony)లోని సయ్యద్‌ అనీసుద్దీన్‌(17) తమ ఇంట్లోని విద్యుత్‌ నీటి పంపు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అతని ఇద్దరు బంధువులు రజాక్ (18), రిజ్వాన్ (17) అతన్ని రక్షించడానికి […]

హైద్రాబాద్(Hyderabad) టోలిచౌకీ(Tolichowki)లో తీవ్ర విషాదం(Tragedy) నెల‌కొంది. బుధవారం రాత్రి ఓ ఇంట్లో విద్యుదాఘాతం (Electrocution) తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో టోలిచౌకీ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పారామౌంట్‌ కాలనీ(Paramount colony)లోని సయ్యద్‌ అనీసుద్దీన్‌(17) తమ ఇంట్లోని విద్యుత్‌ నీటి పంపు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అతని ఇద్దరు బంధువులు రజాక్ (18), రిజ్వాన్ (17) అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు.. కానీ వారిద్దరూ కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇంట్లో నుంచి అరుపులు విన‌ప‌డ‌టంతో ఇరుగుపొరుగు వారు వచ్చి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 12 April 2023 10:01 PM GMT
Yagnik

Yagnik

Next Story