విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని మృతులను తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను వెంట‌నే కేజిహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 3 April 2024 9:37 PM GMT
Yagnik

Yagnik

Next Story