రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే షాద్ నగర్‌ పరిగి రోడ్డులోని ఎస్సార్ పెట్రోల్ పంపు ఎదురుగా బైక్‌ను లారీ ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్య‌క్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘ‌ట‌న‌లో మ‌రొక‌రికి తీవ్ర గాయాలయ్యాయి.

రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) షాద్ నగర్‌(Shadnagar)లో విషాదం చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే షాద్ నగర్‌ పరిగి(Parigi) రోడ్డులోని ఎస్సార్ పెట్రోల్ పంపు(Petrol Bunk) ఎదురుగా బైక్‌(Bike)ను లారీ(lorry) ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్య‌క్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘ‌ట‌న‌లో మ‌రొక‌రికి తీవ్ర గాయాలయ్యాయి. మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు వ్య్త‌క్తులు. షాద్ నగర్ కు చెందిన మ‌రో వ్య‌క్తి.. ముగ్గురు బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీకొట్టిన‌ లారీ ఆపకుండా వెళ్తుండ‌టంతో మొగలిగిద్ద వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వ్య‌క్తిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Updated On 2 July 2023 1:21 AM GMT
Yagnik

Yagnik

Next Story