దొంగ తనం అనేది కొందరికి వృత్తి.. మరి కొందరు అవసరాన్ని బట్టి దొంగతనం చేస్తుంటారు. అది కూడా ఇళ్లలోనో, షాపుల్లోనో, దొంగతనం చూస్తూ ఉంటాం కానీ ఒక వ్యక్తి మాత్రం వెరైటీగా స్మశానంలో దొంగతనం చేశాడు.. అసలు అక్కడ ఏం దొంగతనం చేసాడో తెలిస్తే మీరే షాక్ అవుతారు.

దొంగ తనం అనేది కొందరికి వృత్తి.. మరి కొందరు అవసరాన్ని బట్టి దొంగతనం చేస్తుంటారు. అది కూడా ఇళ్లలోనో, షాపుల్లోనో, దొంగతనం చూస్తూ ఉంటాం కానీ ఒక వ్యక్తి మాత్రం వెరైటీగా స్మశానంలో దొంగతనం చేశాడు.. అసలు అక్కడ ఏం దొంగతనం చేసాడో తెలిస్తే మీరే షాక్ అవుతారు.

తాడేపల్లి పరిధిలోని గ్రామాల స్మశానంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత రాత్రి మెల్లెంపూడి, గుండి మెడ గ్రామాలలో స్మశానాలలో (Graveyard) శవాలను ఖననం చేసే స్ట్రక్చర్ బెడ్ లోని బీడు కడ్డీలను దొంగలించారు. ఒక్కొక్క స్ట్రక్చర్కు లక్ష రూపాయలు పైన ఖర్చు అవుతుందని స్థానికులు అంటున్నారు. గ్రామ శివారులలోని స్మశానాల వద్ద జనసంచారం లేకపోవడంతో దొంగలు పక్క ప్లాన్ తో ఈ దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ బెడ్లను దొంగలించి వాటి విడిభాగాలను మార్కెట్‏లో అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు దొంగలు. దీనిపైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 15 Jun 2023 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story