తెలంగాణ(Telangana)లోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. అడిగినన్ని డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే ఉరివేసి చంపేశాడో కొడుకు. వాడు తల్లిని ఆమె చీర కొంగుతోనే మెడకు బిగించి హత్య చేస్తున్నప్పుడు ఇరుగుపొరుగువారు తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తెలంగాణ(Telangana)లోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. అడిగినన్ని డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే ఉరివేసి చంపేశాడో కొడుకు. వాడు తల్లిని ఆమె చీర కొంగుతోనే మెడకు బిగించి హత్య చేస్తున్నప్పుడు ఇరుగుపొరుగువారు తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే షాద్‌నగర్‌లోని కేశంపేట రోడ్డులో సుగుణమ్మ అనే మహిళకు టీనేజ్‌ వయసున్న కొడుకున్నాడు. వాడి పేరు శివకుమార్‌. పైసల కోసం రోజూ తల్లిని వేధించేవాడు. రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మొన్న ఆదివారం కూడా డబ్బులు అడిగాడు. పైసా కూడా ఇచ్చేది లేదని సుగుణమ్మ చెప్పింది. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. అందరూ చూస్తుండగానే సుగుణమ్మ కట్టుకున్న చీరనే, ఆమె మెడకు చుట్టి గట్టిగా బిగించాడు శివకుమార్. ఇది చూసి స్థానికులు కొందరు శివకుమార్‌ను అడ్డుకున్నారు. అప్పటికే గొంతుకు చీర బిగుసుకుపోవడంతో సుగుణమ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం ఆమె ప్రాణాలు విడిచింది. సుగుణమ్మ ఇంట్లో చనిపోయి ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని చెప్పి, వీడియోలు కూడా పోలీసులకు అందించారు.అయితే తన తల్లి ఆరోగ్య సమస్యల కారణంగానే మరణించిందని బుకాయించాడు శివకుమార్‌. పోలీసుల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మెడకు ఉరి వేసినట్టు వీడియోలో క్లియర్‌గా ఉండడంతో, పోలీసులు శివకుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

Updated On 9 Jan 2024 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story