హైద‌రాబాద్‌ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో రూంలో ఓ యువకుడు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు.

హైద‌రాబాద్‌ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో రూంలో ఓ యువకుడు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు. రాజశేఖర్ (21) అనే యువకుడు హ‌ఫీజ్ పేట్ ఓయో రూంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఓయో రూమును అద్దెకు తీసుకున్న రాజశేఖర్ విషం తాగి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని సిరిసిల్లకు చెందిన నందగిరి రాజశేఖర్‌గా గుర్తించారు. రాజశేఖర్‌ రెండు రోజుల క్రితం హ‌ఫీజ్ పేట్ లోని SBR ఓయోలో దిగినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుప‌త్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్టారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story