మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని దామోహ్-కట్నీ స్టేట్ హైవేలోని దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామన్న గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ట్రక్కు-ప్యాసింజర్ ఆటో ఢీకొన్నాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని దామోహ్-కట్నీ స్టేట్ హైవేలోని దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామన్న గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ట్రక్కు-ప్యాసింజర్ ఆటో ఢీకొన్నాయి. ఇందులో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎవరనే సమాచారం తెలియరాలేదు. గాయపడిన వారిని కలెక్టర్ సుధీర్ కుమార్ కొచ్చర్, ఎస్పీ శృత్ కీర్తి సోమవంశీ చికిత్స నిమిత్తం జబల్‌పూర్ మెడికల్ కాలేజీకి పంపారు.

సోమవారం మధ్యాహ్నం ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే దేహత్ పోలీస్ స్టేషన్‌తో పాటు కలెక్టర్, ఎస్పీతో పాటు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీశారు. అలాగే లారీ కింద కూరుకుపోయిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. గాయ‌ప‌డిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story