కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని

వనపర్తి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 4.. తెల్లవారుజామున కొత్తకోట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గరు చిన్నారులు ఉండగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఓ కుటుంబం హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఆ కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది.

కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తూ ఉన్నారు. కారు చెట్టును ఢీ కొట్టడటంతో స్పాట్‌లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 3 March 2024 9:28 PM GMT
Yagnik

Yagnik

Next Story