ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఆగలి మండలం ఇరిగేపల్లి సమీపంలో సిమెంట్ లోడ్‌తో

ఆంధ్రప్రదేశ్ లోని స‌త్య‌సాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌లి మండ‌లం ఇరిగేప‌ల్లి హైవే పై సిమెంట్ లారీ బొలెరో వాహ‌నం ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌నలో ముగ్గురు మరణించారు. వీరంతా శుభ‌కార్యానికి వెళ్లి తిరుగుప్రయాణంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతులంతా రొల్ల మండ‌లం దాస‌ప్ప‌న‌పాలెం గ్రామానికి చెందిన వారిని గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఆగలి మండలం ఇరిగేపల్లి సమీపంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బొలెరో ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయారు..మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని కాంతప్ప, అమ్మజక్క, రంగప్పగా గుర్తించారు. ప్రమాదంలో టాటా ఏస్ వాహనం నుజ్జు నుజ్జైది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది ఉన్నట్లు సమాచారం.

Updated On 12 Feb 2024 12:01 AM GMT
Yagnik

Yagnik

Next Story