ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మ‌రో 19 మందికి చిన్న పాటి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రకాశం(Prakasham) జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. పెళ్లి బృందం బస్సు(Marriage Bus) అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మ‌రో 19 మందికి చిన్న పాటి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దర్శి(Darshi) సమీపంలోని సాగర్‌ కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతిచెందిన వారిని అబ్దుల్ అజీస్ (65), అబ్దుల్ హాని (60), ముల్లా జానీ బేగం (65), ముల్లా నూర్జహాన్ (58),షేక్ రమిజ్ (48), షేక్ షాభినా (35), షేక్ హీనా (6)గా గుర్తించారు. మృతులంతా పొదిలి(Podili)కి చెందిన వారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు(Police) భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 10 July 2023 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story