నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వస్తుండ‌గా

నల్లగొండ(Nalgonda) జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. కృష్ణాజిల్లా(Krishna District) మోపిదేవి(Mopidevi) ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వస్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. కారు(Car)ను లారీ(Lorry) ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒక‌ మహిళ తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుకుపల్లి మహేశ్(32), ఆయన భార్య జ్యోతి(30), కుమార్తె రిషిత(6), బొమ్మ మహేందర్‌(32), లియాన్సీ(2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్‌ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడ్డారు. మాధవిని మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ టూటౌన్‌ ఎస్సై క్రిష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated On 28 Jan 2024 9:27 PM GMT
Yagnik

Yagnik

Next Story