ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిర్జనప్ర‌దేశంలోని ఓ ఇంట్లో ఉంటున్న బాలిక‌ను చాలా రోజుల పాటు బంధించిన‌ నిందితులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనపై ఉపముఖ్యమంత్రి పార్వతి పరిదా ఢెంకనల్ ఎస్పీతో మాట్లాడి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కొద్దిరోజుల క్రితం బాలికపై సామూహిక అత్యాచారం ఘటన జరిగిందని పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక యంత్రాంగం ఆమెను సమీపంలోని సఖీ సెంటర్‌కు తరలించగా.. బాధితురాలు సఖీ సెంటర్ అధికారులకు తన బాధను వివరించింది.

పోలీసు అధికారి ప్రకారం.. సఖి సెంటర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఆ తర్వాత పోలీసులు చర్యలు ప్రారంభించారు. హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు సహాయపడతాయని ఆయన అన్నారు.

బాధితురాలి తల్లి చనిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. అతని తండ్రి మానసిక రోగి. నిరుపేద కుటుంబం.. కాబట్టి వారు ఒంటరి ఇంట్లో నివసిస్తున్నారని వెల్ల‌డించారు. ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందని దెంకనల్ సదర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ దీపక్ కుమార్ లెంక తెలిపారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story