నిందితులు లైంగిక వేధింపులను చిత్రీకరించారు. ఆ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని

రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే నెపంతో దాదాపు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ను మాత్రమే కాకుండా.. ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 20 మంది మహిళలను మోసగించాడని బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నిందితులు లైంగిక వేధింపులను చిత్రీకరించారు. ఆ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించారు. బాధితులను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశారు. ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని మహిళ పేర్కొంది. ఫిర్యాదుచేసిన మహిళ ఇతర మహిళలతో కలిసి అంగన్‌వాడీలో ఉద్యోగాల కోసం చాలా నెలల క్రితం సిరోహికి వెళ్లింది. వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించిన నిందితులు.. ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చేవారు. వాటిని తిన్న తర్వాత వారు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆమె ఆరోపించింది. స్పృహలోకి వచ్చిన తరువాత.. నిందితులు మహిళలను శారీరక సంబంధాలలో భాగమయ్యేలా బలవంతం చేశారని ఆరోపించారు. మహిళలు గతంలో కూడా తప్పుడు ఫిర్యాదు చేశారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరాస్ చౌదరి తెలిపారు. అయితే ప్రస్తుతం ఎనిమిది మంది మహిళల పిటిషన్‌పై కేసు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Updated On 11 Feb 2024 4:52 AM GMT
Yagnik

Yagnik

Next Story