తిరుపతి పద్మావతి నగర్‌లో ఓ స్తాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ న‌ర‌మేధం సృష్టించాడు.

తిరుపతి పద్మావతి నగర్‌లో ఓ స్తాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ న‌ర‌మేధం సృష్టించాడు. సొంత అన్న పిల్ల‌ల‌ను, వ‌దిన‌ను చంపి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గుడిమెట్ల మోహన్ సాప్ట్‌వేర్ ఇంజనీర్. అత‌డు త‌న అన్న పిల్లలు దేవిశ్రీ, నీరజలతో పాటు అన్న భార్య(వదిన) సునీతను దారుణంగా హత్య చేశాడు. ఆపై అత‌డు కూడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందిన వెంట‌నే జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కుటుంబ కలహాలతో అన్న భార్య, పిల్లలను హతమార్చాడా.? లేక మ‌రేదైనా కార‌ణ‌ముందా.? అనే కోణంలో ద‌ర్యాప్తు ప్రారంభించారు. హత్యలు జరిగిన సమయంలో ఇంటిలో ఎవరెవరు ఉన్నారు.. అనేదానిపై పూర్తి వివరాలు సేకరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించింది.

సొంత మరిదే వదినను, అన్న పిల్లలను హత్య చేసేందుకు గల కారణాల గురించి ఎస్వీయూ పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలను, పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమైన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అదనపు ఎస్పీలు కులశేఖర్, విమల కుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story