ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అమేథీలో పెళ్లి సాకుతో బాలికపై నాలుగేళ్లు గా అత్యాచారం చేసిన కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్(Utterpradesh) రాష్ట్రం అమేథీ(Amethi)లో పెళ్లి సాకు(Pretext of Marriage)తో బాలికపై నాలుగేళ్లు(Four Years)గా అత్యాచారం చేసిన కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం మున్షిగంజ్(Munshiganj) కొత్వాలి(Kotwali) ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక గత నాలుగేళ్లుగా తనతో ఓ యువకుడు(Young Man) మాట్లాడుతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. పెళ్లి సాకుతో త‌న‌తో శారీరక సంబంధం పెట్టుకున్నాడని.. అత‌డిని పెళ్లి చేసుకోమని కోరగా.. శీతల పానీయం(Cool Drink)లో ఏదో కలిపి ఇచ్చాడ‌ని.. దీంతో త‌న‌ ఆరోగ్యం క్షీణించిన‌ట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం నౌగీర్వాన్‌(Naugirwa)కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందింది. కోలుకున్న తర్వాత బాధితురాలు యువకుడికి మెసేజ్(Message) చేయగా.. నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంటి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం(Rape) కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ శివకాంత్ పాండే(Shivakanth Pande) తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. నిందితులపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated On 8 Jun 2023 9:06 PM GMT
Yagnik

Yagnik

Next Story