రంగారెడ్డి జిల్లా కేంద్రం రాజేంద్రనగర్ లో విషాదం(Tragedy) చోటుచేసుకుంది. గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని వివాహిత‌ బలవన్మరణానికి(Suicide) పాల్ప‌డింది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌ను నందినిగా గుర్తించారు పోలీసులు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక నందిని తనువు చాలించినట్లు తెలుస్తోంది. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ నందిని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మా అమ్మాయిని అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు […]

రంగారెడ్డి జిల్లా కేంద్రం రాజేంద్రనగర్ లో విషాదం(Tragedy) చోటుచేసుకుంది. గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని వివాహిత‌ బలవన్మరణానికి(Suicide) పాల్ప‌డింది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌ను నందినిగా గుర్తించారు పోలీసులు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక నందిని తనువు చాలించినట్లు తెలుస్తోంది. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ నందిని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మా అమ్మాయిని అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెడుతున్నారు.. ఒంటిపై గాయాలు ఉన్నాయి.. అతి దారుణంగా మా బిడ్డను కొట్టి చంపేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నందిని స్వస్థలం కర్ణాటక(Karnataka) లోని బీదర్ జిల్లా. విష‌యం తెలియ‌డంతో నందిని తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ కు వ‌చ్చారు. నందిని ఆత్మ‌హ‌త్య‌పై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నందిని భర్త రత్నదీప్ ను అరెస్ట్ చేయ‌గా.. అత్తమామలు విజయ, లక్ష్మణ్‌ రావు లు పరారీలో ఉన్నారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని.. కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ నందిని త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

Updated On 7 April 2023 11:48 PM GMT
Yagnik

Yagnik

Next Story