ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లో 30 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేశాడు.

ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లో 30 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేశాడు. హ‌త్య అనంత‌రం మృతురాలి మృతదేహాన్ని చెత్త సంచిలో వేసి ఇంటి పైక‌ప్పుపై దాచాడు. మృతురాలిని మధు స్మితగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం జూలై 12న ఇరుగుపొరుగు వారికి మృతురాలి ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి మృతదేహాన్ని నిందితుడు బ్యాగ్‌లో గట్టిగా ప్యాక్ చేయ‌గా.. తలకు తీవ్ర‌మైన గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. భ‌ర్త ప్రదీప్ భోలా చిన్న విషయాలకే భార్య‌తో తరచూ గొడ‌వ‌ప‌డేవాడు. అలాంటి ఒక చిన్న‌ వాగ్వాదమే పెద్ద గొడ‌వ‌గా మారడంతో క్ష‌ణికావేశంలో భ‌ర్త‌ పదునైన వస్తువుతో దాడి చేయడంతో మధు స్మిత మరణించిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి హత్య రెండు రోజుల క్రాతం జరిగివుండ‌వ‌చ్చ‌ని పోలీసులు అంచనా వేశారు. హ‌త్య అనంత‌రం నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story