మానవ మృగాలు చెలరేగిపోతున్నాయి. ఛత్తీస్‎గఢ్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది . భార్య ని చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్ లో వేసాడు . పోలీసులకి అసలు విష్యం తెలిసి ఆరా తీయగా అసలు ఎం జరిగిందంటే ఛత్తీస్ గఢ్ రాష్ట్రము బిలాస్‍పూర్ పరిధిలోని ఉస్లాపూర్ (Uslapur) ప్రాంతంలో ఒక వ్యక్తి. భార్య వేరే వ్యక్తి తో లైంగిక సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో తన భార్యను అతి కిరాతకం గా హత్య […]

మానవ మృగాలు చెలరేగిపోతున్నాయి. ఛత్తీస్‎గఢ్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది . భార్య ని చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్ లో వేసాడు . పోలీసులకి అసలు విష్యం తెలిసి ఆరా తీయగా అసలు ఎం జరిగిందంటే

ఛత్తీస్ గఢ్ రాష్ట్రము బిలాస్‍పూర్ పరిధిలోని ఉస్లాపూర్ (Uslapur) ప్రాంతంలో ఒక వ్యక్తి. భార్య వేరే వ్యక్తి తో లైంగిక సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో తన భార్యను అతి కిరాతకం గా హత్య చేసాడు .తరచూ అనుమానంతో వేధించేవాడు . భార్య ను అతి దారుణం గా హతమార్చటమే కాకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇంటి మేడ మీద ఉన్న వాటర్‏ట్యాంక్‏లో ఆ శరీరభాగాలని వేసాడు. ఈ విషయం నెలరోజుల పాటు ఎవ్వరికి తెలియదు. చుట్టుపక్కలవాళ్ళకి దుర్వాసన రావటం తో పోలీసులకి కంప్లైంట్ చేయటం జరిగింది . హత్యకు గురికాబడిన మహిళా పేరు సాహు కాగా ఆమె భర్త హంతకుడు పేరు పవన్ ఠాకూర్ .

రంగం లో కి దిగిన పోలీసులకి ఆశ్చర్యపోయే సంఘటనలు ఎదురయ్యాయి. నిందితుడి భార్యతో వాగ్వివాదం జరగగా ఆమెను అతి దారుణం గా చంపటం తో పాటు శరీరాన్ని ఏమిచేయాలో తెలియక ముక్కలుగా నరికాడు . ఎక్కడైనా బయటపడేస్తే అనుమానము వస్తుందనే భయంతో ఇంటి పైన వాటర్‏ట్యాంక్‏లో వేసాడు.ఈ ఘటన జరిగి దాదాపు నెల నుండి 2 నెలలు అయి ఉండచ్చు అని అనుమానము వ్యక్తం చేసారు పోలీసులు . నిజం ఒప్పుకున్నా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి వాటర్ ట్యాంక్ లో ఉన్న శరీరభాగాలు సైతం పోస్టుమార్టం కి తరలించటం జరిగింది.

Updated On 6 March 2023 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story