తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది

గ్రేటర్ నోయిడాలో అతివేగంగా దూసుకు వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో.. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. బైక్‌పై ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని రద్దీగా ఉండే పరి చౌక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. సురేంద్ర తన అక్క చెల్లెళ్ళతో వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్నాడు.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. ముగ్గురు ఆసుపత్రిలో చనిపోయినట్లు ప్రకటించారు. నోయిడాలోని వారి నివాసం కులేసర నుండి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా నుండి వారు తిరిగి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సురేందర్, అతని సోదరీమణులు శైలి, అను మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రోడ్డుపై బాధితులు పడి ఉన్నారు.

Updated On 13 April 2024 12:12 AM GMT
Yagnik

Yagnik

Next Story