ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన‌ స్వామి బండారం అనే వ్య‌క్తి తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా వాసి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు నెలల క్రితం స్వామి, యువ‌తి ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు. ఈ క్ర‌మంలోనే స్వామి బండారం త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని చెప్పి యువ‌తికి పెళ్లి ప్రపోజల్‌ చేశాడు. ఆమెను తన తల్లిదండ్రులతో సహా కుటుంబానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చి హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. ఆ త‌ర్వాత తన తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని న‌మ్మ‌బ‌లికాడు. దీంతో జూలై 2న యువ‌తి రాయ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు వచ్చింది. ఆమెను స్వామి బండారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్ గదిలో స్వామి బండారం మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆమెను తిరిగి రాయ్‌పూర్ పంపించాడు.

రాయ్‌పూర్‌కు వెళ్లిన తర్వాత మహిళ మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును మహంకాళి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సోమవారం స్వామి బండారం ఆస్ట్రేలియాకు పారిపోతుండ‌గా.. ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు, సిఐఎస్‌ఎఫ్‌తో పోలీసు బృందం సమన్వయంతో ఎయిర్‌పోర్టులో అతడిని పట్టుకుని అరెస్టు చేశారని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story