మెదక్ జిల్లా హెరిలా గ్రామంలో తన ఎనిమిదేళ్ల కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

మెదక్ జిల్లా హెరిలా గ్రామంలో తన ఎనిమిదేళ్ల కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కుమార్తెను భారంగా భావించిన తండ్రి.. ఆమె చదువు, భవిష్యత్తులో వివాహానికి డబ్బు ఖర్చు చేయడం తన‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. 14వ తేదీన‌ కుమార్తెకు విషమిచ్చాడు. నిందితుడిని ఇక్కిరి శ్రీశైలంగా గుర్తించారు.

నివేదికల ప్రకారం.. నిందితుడు తన కుమార్తె ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఎలుకల మందును శీతల పానీయంలో క‌లిపి తాగించాడు. బాలిక‌ పరిస్థితి విషమించడంతో.. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్క‌డి నుండి ఆమెను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

కుమార్తె మరణం తరువాత కూడా తండ్రిలో చ‌ల‌నం లేక‌పోడ‌వంతో కుటుంబ సభ్యులలో అనుమానాలు పెరిగాయి. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో తానే కూతురుని చంపిన‌ట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story