తల్లిని వలలో వేసుకుని. మైనర్ బాలికకు కడుపు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు వరుసకు వదినయ్యే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు.

తల్లిని వలలో వేసుకుని. మైనర్ బాలికకు కడుపు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు వరుసకు వదినయ్యే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతేకాకుండా ఆ మహిళా శిరోమణి తన సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసింది తల్లి. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు(Toroor) పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రి(Amma Hospital)లో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి. నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.. భార్య తన కూతురితో కలిసి భువనగిరి(Bhuvanagiri) జిల్లా ఘట్‌సర్(Ghatkesar) ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము(Ramu) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురిపై కన్నేశాడు. తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్దిరోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు. బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్‌కు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై, బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన రాము, అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచారం, పోక్సో కేసులను పోలీసులు నమోదు చేశారు.

ehatv

ehatv

Next Story