మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్, బొల్లారంలోని ఓ ఆసుపత్రిలో

మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్, బొల్లారంలోని ఓ ఆసుపత్రిలో చెట్టు కూలడంతో భార్యకు తీవ్రగాయాలు కాగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు పెద్ద చెట్టు వారిపై పడింది.

సికింద్రాబాద్ పరిధిలోని శామీర్పేట్ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఈ ఇద్దరు భార్య భర్తలు ఆసుపత్రికి వస్తున్న సందర్భంలో ద్వారం వద్ద ఉన్న చెట్టు కూలడంతో రవీందర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య సరళ దేవికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన భార్య సరళను స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

Updated On 21 May 2024 3:13 AM GMT
Yagnik

Yagnik

Next Story