బీహార్‌లోని దర్భంగాలో తెల్లవారుజామున వివాహ వేడుకలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.

బీహార్‌లోని దర్భంగాలో తెల్లవారుజామున వివాహ వేడుకలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప‌టాకులు కాల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప‌టాకుల నిప్పుర‌వ్వ‌లు సిలిండర్ పై ప‌డ‌టం కారణంగా అది పేల‌డంతో మంటలు చెలరేగాయి, ఈ ఘ‌ట‌న‌లో మండ‌పం కూడా బూడిదైంది.

పటాకుల నుంచి నిప్పురవ్వలు సిలిండర్‌పైకి చేరాయి. మృతులు వధువు తరఫు వారుగా చెబుతున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌తో పెళ్లి సంతోషం శోకసంద్రంగా మారింది. పోలీసులు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 25 April 2024 9:56 PM GMT
Yagnik

Yagnik

Next Story