గీతాంజలి ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ పోలీసులు సీరియస్ గా యాక్షన్ లోకి దిగారు

గీతాంజలి ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ పోలీసులు సీరియస్ గా యాక్షన్ లోకి దిగారు. గీతాంజలి కొన్ని మీడియా ఛానెల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, అది ట్రోల్స్‌ను ఆకర్షించిందని పోలీసులు తెలిపారు. రాయడానికి కూడా వీలు లేని భాషలో విమర్శలు చేయడం, తిట్టడం జరిగిందని ఏపీ పోలీసులు తెలిపారు. గీతాంజలిని మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

గీతాంజలి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని.. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు చెబుతున్నారు.

Updated On 12 March 2024 9:08 PM GMT
Yagnik

Yagnik

Next Story