హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బహదూర్‌పురాలోని తాడ్‌బన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గాయపడగా ఓ మహిళ మృతి చెందింది. కింగ్స్‌ కాలనీకి చెందిన బాధితురాలు బుష్రా ఫాతిమా (30) అక్కడికక్కడే మృతి చెందింది. తన భర్త అహ్మద్‌ మొహియుద్దీన్‌తో కలిసి ఫాతిమా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌కు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు దంపతులను ఢీకొట్టింది. భార్యాభర్తలు రోడ్డుపై పడిపోవడంతో బుష్రా ఫాతిమా తలకు గాయాలయ్యాయి. […]

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బహదూర్‌పురాలోని తాడ్‌బన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గాయపడగా ఓ మహిళ మృతి చెందింది. కింగ్స్‌ కాలనీకి చెందిన బాధితురాలు బుష్రా ఫాతిమా (30) అక్కడికక్కడే మృతి చెందింది. తన భర్త అహ్మద్‌ మొహియుద్దీన్‌తో కలిసి ఫాతిమా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌కు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు దంపతులను ఢీకొట్టింది. భార్యాభర్తలు రోడ్డుపై పడిపోవడంతో బుష్రా ఫాతిమా తలకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మరణించింది.

సంఘటన జరిగిన వెంటనే, TSRTC డ్రైవర్ ర్యాష్ గానూ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని ఆరోపిస్తూ, అక్కడికి చేరుకున్న జనం TSRTC బస్సును ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. బుష్రా ఫాతిమా మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated On 4 Feb 2024 10:17 PM GMT
Yagnik

Yagnik

Next Story