భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు శివ మోహన్ రావు

అనుమానం పెను భూతమైతే ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. హైదరాబాద్ లో తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య మీద అనుమానం పెంచేసుకున్న ఓ భర్త భార్యను కిరాతకంగా హత్య చేశాడు.

భార్య విశ్వసనీయతపై అనుమానం వచ్చిన భర్త ఆదివారం ఉప్పల్‌లోని వారి ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ మోహన్‌రావుకు శివ లక్ష్మితో వివాహమైంది. దంపతులిద్దరూ ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు శివ మోహన్ రావు. ఈ విషయమై తరచూ ఆమెతో గొడవ పడేవాడు. “ఆదివారం, ఈ విషయంపై భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది, కోపంలో మోహన్ రావు అతని భార్యపై దాడి చేసి చంపాడు. ఈ విషయాన్ని అతడు తన కుమారుడికి ఫోన్‌లో సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యాడు’’ అని ఉప్పల్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.

Updated On 7 April 2024 9:13 PM GMT
Yagnik

Yagnik

Next Story